Featuredఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లా

ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 20% శాతం పెంపు, గ్రాట్యుటీ రూ.4లక్షలకు పెంపు.

  • ఏపీలో పీఏసీఎస్‌ ఉద్యోగులకు జీతాలు పెంపు
  • ఏకంగా 20శాతానికి జీతాలు పెంచుతూ నిర్ణయం
  • గ్యాట్యుటీ రూ.2 లక్షల నుంచి రూ.4లక్షలకు పెంపు

AP Govt Hikes 20% Salaries For PACS Employees: ఏపీలో పీఏసీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఈ మేరకు కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న వారంతా ఆందోళన విరమించారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. హామీలు ఇచ్చింది. అంతేకాదు పీఏసీఎస్‌ ఉద్యోగుల జీతాల 20శాతం పెంపుకు ఓకే చెప్పారు. అంతేకాదు గ్రాట్యుటీని రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ప్రతి ఉద్యోగికీ రూ.5లక్షల గ్రూప్‌ ఆరోగ్య బీమా అమలుకు హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల) ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ప్రభుత్వం వారి జీతాలను ఏకంగా 20శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. అంతేకాదు పీఏసీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటుగా ప్రతి ఉద్యోగికి సమగ్ర గ్రూప్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పథకం కింద ప్రతి ఉద్యోగికి రూ.5లక్షల కవరేజీ అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం వరాలు ప్రకటించడంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *